ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తలకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2021-01-21T05:46:56+05:30

పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా కేఈ కుటుంబం అండగా ఉంటుందని పత్తికొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  పత్తికొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు


మద్దికెర, జనవరి 20: పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా కేఈ కుటుంబం అండగా ఉంటుందని పత్తికొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. బుధవారం మండలంలోని యడవలి గ్రామంలో మాజీ ఎంపీటీసీ మాబుసాబ్‌ను కేఈ శ్యాంబాబు పరామర్శించారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో  టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని విమర్శించారు.  మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సహకారంతో పత్తికొండ నియోజకవర్గంలో రూ.100కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ పురుషోత్తంచౌదరి, టీడీపీ జిల్లా కార్యదర్శి ధనుంజయుడు, మాజీ జడ్పీ చైర్మన్‌ బత్తిన వెంకటరాముడు, తెలుగుయువత నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌గౌడ్‌, మండల ప్రధానకార్యదర్శి పెరవలి రామాంజినేయులు, నాయకులు ఆకుల వేణుగోపాల్‌, రంగస్వామి, నెట్టికంటి నాగరాజు, టైలర్‌ హరి, మాజీ ఎంపీటీసీ శివశంకర్‌, కృష్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T05:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising