ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూర్పిడి మిషన్‌ కింద పడి మహిళ మృతి

ABN, First Publish Date - 2021-05-18T05:45:49+05:30

మినుము పంటను నూర్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మిషన్‌ బోల్తా పడటంతో గోవిందమ్మ(45) అనే మహిళ కూలీ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. మరో ఇద్దరికి గాయాలు


పగిడ్యాల, మే 17: మినుము పంటను నూర్చేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మిషన్‌ బోల్తా పడటంతో గోవిందమ్మ(45) అనే మహిళ కూలీ మృతి చెందింది. పగిడ్యాల గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామ సమీపంలోని ఓ రైతుకు చెందిన మినుము పంటను నూర్పిడి చేసేందుకు ఉదయం గోవిందమ్మ, సరోజ, శేషమ్మలతో పాటు మరో ఐదుగురు కూలీలు పొలానికి వెళ్లారు. పంటను నూర్పిడి చేసిన అనంతరం కూలీలు ట్రాక్టర్‌ మిషన్‌పై కూర్చొని ఇంటికి బయలు దేరారు. పాత ప్రాతకోట సమీపంలోని పుల్యాల డ్యామ్‌ వద్ద ఉన్న మలుపు వద్ద డ్రైవర్‌ నాగశివుడు అతివేగంతో నడపడం వలన నూర్పుడు మిషన్‌ బోల్తా పడటంతో గొవిందమ్మ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈ సంఘటనలో సరోజ, శేషమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు గంగాధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవానికి పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు పీఎ్‌సఐ రిజ్వాన్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-18T05:45:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising