ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-10-17T06:22:57+05:30

మెట్టినింట్లో దసరా పండుగ ఉన్నా.. పుట్టినింట్లో తమ్ముని భార్యకు జరిగే సీమంతానికి భర్తతో పాటు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  భర్తకు గాయాలు
  2.  స్కూటర్‌ను ఢీకొన్న లారీ


ఆదోని రూరల్‌, అక్టోబరు 16: మెట్టినింట్లో దసరా పండుగ ఉన్నా.. పుట్టినింట్లో తమ్ముని భార్యకు జరిగే సీమంతానికి భర్తతో పాటు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.  ఆదోని మండలం పెద్దహరివానం గ్రామానికి చెందిన హంపమ్మ, ఉత్తమన్నలకు ముగ్గురు కుమారులు, ఒక  కూతురు.  శకుంతలమ్మ (27)ను కోసిగి మండలం అగసనూరు గ్రామానికి చెందిన హుసేనప్పకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు.  శనివారం రాత్రి తమ్ముడు జగదీష్‌ భార్య అశ్వినికి సీమంతం జరగనుంది. ఈ కార్యక్రమానికి భర్త హుసేనప్పతో కలిసి శకుంతలమ్మ ద్విచక్ర వాహనంలో పెద్దహరివాణం బయలుదేరారు. సంతెకుడ్లూరు గ్రామ సమీపాన ఆదోని వైపు వెళ్తున్న లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో శకుంతలమ్మ అక్కడికక్కడే రోడ్డుపై పడి మృతి చెందింది.  భర్త గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని లారీ వివరాలను సేకరిస్తున్నామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఇస్వీ ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు.

Updated Date - 2021-10-17T06:22:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising