ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-11-28T05:51:07+05:30

మండల పరిధిలోని అలువాల గ్రామంలో వడ్డె లక్ష్మి(33)అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోనెగండ్ల, నవంబరు 27: మండల పరిధిలోని అలువాల గ్రామంలో వడ్డె లక్ష్మి(33)అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలువాల గ్రామానికి చెందిన వడ్డె రామాంజినేయులుకు పదేళ్ల క్రితం సూగురుకు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి రెండు ఎకరాల పొలం ఉంది. పొలంతోపాటు కూలి పని చేసుకొని జీవనం సాగించే వారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రామాంజినేయులు మద్యానికి బానిస అయ్యాడు. పంటలు సరిగా పండకపోగా కూలీ నాలీ చేసుకొని వచ్చిన సొమ్ముతో మద్యం తాగేవాడు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. మద్యం మానేయాలని లక్ష్మి చెప్పినా పట్టించుకునేవాడు కాదు. చివరకు లక్ష్మికి జీవితంపై విరక్తి కలిగింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-28T05:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising