ప్రియుడితో కలిసి భర్తను చంపి.. పోలీస్స్టేషన్కు వెళ్లి...!
ABN, First Publish Date - 2021-10-17T14:56:25+05:30
కర్నూలు : జిల్లాలోని ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ..
కర్నూలు : జిల్లాలోని ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో భర్తపై భార్య దారుణానికి పాల్పడింది. నెల రోజుల కిందట ప్రియుడితో కలిసి భర్తను అతికిరాతకంగా భార్య హతమార్చింది. అనంతరం ఏమీ తెలియనట్లుగా స్థానికంగా ఉన్న ఓర్వకల్లు పోలీస్ స్టేషన్లో తన భర్త కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిశితంగా దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. అనుమానంతో పోలీసులు మొదట ఆమెనే విచారించారు. ఈ విచారణలో భార్యే, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు పోలీసులు తేల్చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2021-10-17T14:56:25+05:30 IST