‘మార్కెట్ రేటు ఇస్తేనే భూములు ఇస్తాం’
ABN, First Publish Date - 2021-12-04T04:35:33+05:30
మార్కెట్ రేటు ఇస్తేనే రైల్వే లైనుకు భూములు ఇస్తామని రైతులు రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.
బనగానపల్లె, డిసెంబరు 3: మార్కెట్ రేటు ఇస్తేనే రైల్వే లైనుకు భూములు ఇస్తామని రైతులు రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయంలోని పొదుపు భవనంలో నంద్యాల ఇనచార్జి ఆర్డీవో మల్లిఖార్జునుడు ఏపీఐసీఎల్ జోనల్ మేనేజరు లక్ష్మీనారాయణమ్మ, తహసీల్దారు ఆల్ఫ్రెడ్ జయజ్యోతి సిమెంట్ రైల్వేలైన కోసం భూములు కోల్పోనున్న రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పొలాల రేట్లు మాట్లాడిన తర్వాతనే సర్వే చేయాలని కోరారు. తక్కువ ధరలకు భూములు ఇవ్వమని రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ ప్రవీణ్కుమార్, వీఆర్వో జ్యోతి, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-04T04:35:33+05:30 IST