శాకాంబరి అవతారంలో వెంకటేశ్వరస్వామి
ABN, First Publish Date - 2021-07-25T06:01:27+05:30
పట్టణంలోని ఇందిరానగర్ ఉప్పర వీధిలో వెలసిన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వాముల వారు శాకాంబరి అలంకారంలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు.
ఆదోని(అగ్రికల్చర్), జూలై 24: పట్టణంలోని ఇందిరానగర్ ఉప్పర వీధిలో వెలసిన వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వాముల వారు శాకాంబరి అలంకారంలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అన్ని రకాల కూరగాయలతో గురుపౌర్ణమిని పురష్కరించుకొని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు.
Updated Date - 2021-07-25T06:01:27+05:30 IST