ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకగ్రీవంగా గొర్రెల పెంపకందారుల సంఘం ఎన్నిక

ABN, First Publish Date - 2021-10-30T04:06:19+05:30

మండల పరిధిలోని వేల్పనూరు గ్రామంలో శుక్రవారం గొర్రెల పెంపకదారుల సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆత్మకూరు(వెలుగోడు), అక్టోబరు 29: మండల పరిధిలోని వేల్పనూరు గ్రామంలో శుక్రవారం గొర్రెల పెంపకదారుల సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయ ఆవరణలో వెటర్నరీ ఏడీ ధనుంజయ నేతృతంలో జరిగిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సహకార సంఘం అధ్యక్షుడిగా మిడ్డూరు పుల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా పాలమర్రి పరమేశ్వరుడు, పారుమంచాల వెంకటరమణ, చెరకుచెర్ల రామసుబ్బయ్య, సుద్దుల నడిపి మద్దిలేటి, బూజనూరు మద్దిలేటిలను గొర్రెల పెంపకందారులు ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏడీ ధనుంజనుడు ఎన్నికైన వారికి డిక్లరేషన పత్రాలను అందజేసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గొర్రెల పెంపకంలో భాగంగా ప్రవేశపెట్టే పథకాలను లబ్ధిదారులకు అందజేసేలా సహకార సంఘం కమిటీ చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఆయా పథకాల గురించి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు సుధాకరరెడ్డి, జోత్స్నాదేవి, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2021-10-30T04:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising