రెండు మోటార్ సైకిళ్లు ఢీ.. నలుగురికి గాయాలు
ABN, First Publish Date - 2021-07-25T05:57:46+05:30
మంత్రాలయం మండలం సూగూరు క్రాస్ వద్ద ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ వద్ద శనివారం రెండు మోటార్సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మంత్రాలయం, జూలై 24: మంత్రాలయం మండలం సూగూరు క్రాస్ వద్ద ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ వద్ద శనివారం రెండు మోటార్సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ వేణుగోపారాజు తెలిపిన వివరాల మేరకు.. సూగూరు గ్రామానికి చెందిన ఉదయఆచారి, పరమేష్ ఆచారి, రాజేష్లు కలిసి మోటార్సైకిళ్లపై మంత్రాలయం నుంచి సూగూరు గ్రామానికి బయలుదేరారు. నందవరానికి చెందిన మాల వెంకన్న అనే వ్యక్తి మాధవరం వైపు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రెండు మోటార్సైకిళ్లు ఢీకొన్నాయి. దీంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకన్న, పరమేష్ ఆచారి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎస్ఐ వేణుగోపాల్రాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-07-25T05:57:46+05:30 IST