తుంగభద్ర 33 గేట్లు ఎత్తివేత
ABN, First Publish Date - 2021-07-27T21:51:17+05:30
కర్నూలు జిల్లా: తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద రావడంతో...
కర్నూలు జిల్లా: తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద రావడంతో అధికారులు తుంగభద్ర జలాశయం 33 గేట్లు ఎత్తివేశారు. దీంతో నదిలో నీటి మట్టం పెరిగింది. మరోవైపు తుంగభద్ర ప్రవాహం కర్నూలు జిల్లా, కోసిగి మండలం, అగసనూరు గ్రామ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఆర్డీఎస్ కుడికాలువ పనులకు ఆటంకం కలగకుండా ప్రవాహానికి అడ్డుగా గట్టు నిర్మించారు. తుంగభద్ర ఉధృతికి గట్లు తెగిపోతే నీరు మొత్తం గ్రామంలోకి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Updated Date - 2021-07-27T21:51:17+05:30 IST