ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీకి పతనం తప్పదు

ABN, First Publish Date - 2021-12-06T04:33:20+05:30

రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపాలనకు పతనం తప్పదని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు.

కురుకుందలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

ఆత్మకూరు రూరల్‌, డిసెంబరు 5: రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపాలనకు పతనం తప్పదని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు.  ఆదివారం ఆత్మకూరు మండలంలోని కురుకుంద గ్రామంలో ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం గౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని మండిపడ్డారు.. నవరత్నాల పేరిట రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేశారని అన్నారు. దీనివల్ల భవిష్యత తరాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.  ఇదిలావుంటే పవిత్రమైన అసెంబ్లీలో మహిళలపై దూషణలు చేయడం బాధాకరమని అన్నారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన గౌరవ సభను వైసీపీ నేతలు కౌరవ సభగా మార్చేశారని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న దురాగతాలను అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యేలు నిరూపిస్తారన్న కారణంతోనే మహిళలపై దురుసు పదజాలం ప్రయోగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన వంగాల శివరామిరెడ్డి,ఆత్మకూరు మాజీ సర్పంచ గోవిందరెడ్డి, టీడీపీ నాయకులు మల్లి కార్జున రెడ్డి, శివప్రసాద్‌ రెడ్డి, అబ్దుల్లాపురం బాషా,  పుల్లారెడ్డి, వేణు, ఫకృద్దీన, పస్పిల్‌మున్నా, ముస్తఫా, రామ్మూర్తి, గ్రామ నాయకులు లింగస్వామి అచ్చిరెడ్డి, వేణుగోపాల్‌, శేఖర్‌రెడ్డి, జోరాఅహ్మద్‌, గోపాలయ్యలు పాల్గొన్నారు.

మహానంది: ప్రస్తుతం రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతున్నదని శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త రామలింగారెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం మహానంది మండలం తమ్మడపల్లిలో ఆడపడుచుల గౌరవం కోసం గౌరవసభను నిర్వహించారు. ఆయన మాట్లాడారు. సీఎం జగన ఆరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆడపడుచులకు రక్షణ కరువైందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో గాజులపల్లిఆర్‌ఎస్‌ సర్పంచ అస్లాంబాషా, మహానంది దేవస్దానం మాజీ చైర్మన పాణ్యం ప్రసాదరావు, తమ్మడపల్లి జనార్దనరెడ్డి, నందిపల్లి మహేశ్వరరెడ్డి, మౌళీశ్వరరెడ్డి  పాల్గొన్నారు. 

మంచి పాలన టీడీపీకే సాధ్యం

బండి ఆత్మకూరు, డిసెంబరు 5: రాష్ట్రంలో మంచి పాలన టీడీపీకే సాధ్యమని మండల నాయకుడు నందిపాటి నరసింహారెడ్డి, కచర్ల సురే్‌షరెడ్డి సిద్దయ్య, జాకీర్‌, బాబు అన్నారు. ఆదివారం  మండలంలోని జీసీపాలెం, లింగాపురం గ్రామాల్లో ఆడపడచుల ఆత్మగౌరవ సభలు జరిగాయి. వారు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా  సీఎం జగన రాక్షసపాలన సాగిస్తున్నాడని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదో ఒక కారణంతో కోత కోస్తున్నారన్నారు.  కార్యక్రమంలో ఉప సర్పంచ చిన్నలింగారెడ్డి, మాజీ సర్పంచ శ్రీనివాసులు, హేమసుందర్‌రెడ్డి,షఫీవుల్లా,  ఎన.కృష్ణారెడ్డి, శంకర్‌రెడ్డి, సుధాకర్‌, ముజీ్‌ఫ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-06T04:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising