హుండీ ఆదాయం రూ.27,41,635
ABN, First Publish Date - 2021-09-29T04:53:04+05:30
మహానందీ క్షేత్ర హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. దేవస్థానానికి 53 రోజులకు రూ.27,41,635 ఆదాయం వచ్చిందని ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు.
మహానంది, సెప్టెంబరు 28: మహానందీ క్షేత్ర హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. దేవస్థానానికి 53 రోజులకు రూ.27,41,635 ఆదాయం వచ్చిందని ఈవో మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని అభిషేకమండపంలో ప్రధాన ఆలయాలలోని హుండీల ద్వారా రూ.26,72,376, అన్నదానం హుండీ ద్వారా రూ.48,574, గోశాల ద్వారా రూ.20,685 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో యర్రమల మధు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, టెంపుల్ ఇనస్పెక్టర్ సుబ్బారెడ్డి, క్యాషియర్ నీలకంఠరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-09-29T04:53:04+05:30 IST