ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టుల్లో ఎన్ని మొట్టికాయలు?

ABN, First Publish Date - 2021-01-27T06:25:52+05:30

గతంలో ఏ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వంలా కోర్టుల్లో మొట్టికాయలు తినలేదని, అయినా జగన్‌లో మార్పు రాలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు

అంబేడ్కర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  పులివెందుల రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి 
  2.  దేశం నేతల సూచన


కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 26: గతంలో ఏ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వంలా  కోర్టుల్లో  మొట్టికాయలు తినలేదని, అయినా జగన్‌లో మార్పు రాలేదని  తెలుగుదేశం పార్టీ నాయకులు  అన్నారు. మంగళవారం  నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన కర్నూలు లోక్‌సబ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్‌, కర్నూలు, నంద్యాల మహిళా కమిటీ  అధ్యక్షులు  షేక్‌ ముం తాజ్‌, పార్వతమ్మ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిశెట్టి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు.  అంబేడ్కర్‌ చిత్రపటానికి  క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుణపాఠంగా భావించి ఇప్పటి నుంచైనా పులివెందుల రాజారెడ్డి రాజ్యాంగానికి స్వస్తి పలకాలని, అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాగేంద్రకుమార్‌, సత్రం రామక్రిష్ణుడు, అబ్బాస్‌, జేమ్స్‌, హనుమంతరావు చౌదరి, రామాంజినేయులు, పేరపోగు రాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T06:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising