ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.50 వేల విరాళం ఇచ్చిన టీడీపీ నాయకుడు

ABN, First Publish Date - 2021-07-31T05:50:43+05:30

కాల్వబుగ్గలోని సురభి గోశాలకు టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి, టీజీవీ సంస్థల చైర్మన్‌ టీజీ భరత్‌ రూ.50 వేల విరాళాన్ని అందజేశారు.

విరాళం అందజేస్తున్న టీజీ భరత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై 30: కాల్వబుగ్గలోని సురభి గోశాలకు టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి, టీజీవీ సంస్థల చైర్మన్‌ టీజీ భరత్‌ రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. శుక్రవారం కర్నూలులోని తన కార్యాలయంలో గోశాల నిర్వాహకులకు చెక్కును అందించారు. ఆగస్టు 4న గోశాలలో భరతమాత కలశ పూజను నిర్వాహకులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పూజలో పాల్గొనాలని గోశాల సభ్యులు టీజీ భరత్‌ను ఆహ్వానించారు. కార్యక్రమంలో గోశాల నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షులు మురళి చౌదరి, బాలగంగాధర్‌ రెడ్డి, జనరల్‌ సెక్రటరీ పోచా మహేశ్వరరెడ్డి, సెక్రటరీ శంకరయ్య, వాసవి సేవాదల్‌ గౌరవాధ్యక్షుడు శేషఫణి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T05:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising