ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకుడి మృతి

ABN, First Publish Date - 2021-05-18T05:17:25+05:30

మండలంలోని అమడగుంట్ల సర్పంచ్‌ వరలక్ష్మి భర్త, టీడీపీ నాయకుడు రఘునాథరెడ్డి (55) అనారోగ్యంతో సోమవారం ఆసుపత్రిలో మృతి చెందారు.

రఘునాథరెడ్డి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కోడుమూరు(రూరల్‌), మే 17: మండలంలోని అమడగుంట్ల సర్పంచ్‌ వరలక్ష్మి భర్త, టీడీపీ నాయకుడు రఘునాథరెడ్డి (55) అనారోగ్యంతో సోమవారం ఆసుపత్రిలో మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఇంట్లో బీపీ సమస్యతో కళ్లు తిరిగి పడిపోగా ఆయనను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగారు. ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రఘునాథరెడ్డి సతీమణి వరలక్ష్మి అమడగుంట్ల సర్పంచ్‌గా గెలుపొందారు. రఘునాథరెడ్డి మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం కాగా కుమార్తెకు వివాహం అయింది. వారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వారు రాలేని పరిస్థితి. తండ్రి అంత్యక్రియలు కూడా నోచుకోలేక పోయారు. సోమవారం సాయంత్రం రఘునాథరెడ్డి అంత్యక్రియలు జరిపించారు.


Updated Date - 2021-05-18T05:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising