ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులు వేగవంతం చేయాలి: సబ్‌ కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-07-24T05:35:37+05:30

మండలంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిరివెళ్ల, జూలై 23: మండలంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. శిరివెళ్ల మేజర్‌ గ్రామ పంచాయతీలో ఆమె శుక్రవారం పర్యటించారు. కాదరబాదర గ్రామ సమీపంలో ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను, మాలమాగు వాగును, పంటలను పరిశీలించారు. శిరివెళ్లలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పలు కాలనీల ప్రజలు సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గుండంపాడు గ్రామ ఆర్బీకే, సచివాలయాలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ఆమె వెంట ఇన్‌చార్జి తహసీల్దార్‌, ఎంపీడీవోలు మాధవ, సాల్మన్‌, వ్యవసాయాధికారి అబ్దుల్‌హక్‌, సర్వేయర్‌ సరిత, పంచాయతీరాజ్‌ డీఈ లక్ష్మీ నరసింహులు, కార్యదర్శి సుబ్బరాయుడు ఉన్నారు. 



Updated Date - 2021-07-24T05:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising