ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూలన పడేశారు..!

ABN, First Publish Date - 2021-04-17T04:44:17+05:30

టీడీపీ హయాంలో రైతులకు ఆదరణ పథకం కింద మంజూరైన రాయితీ పరికరాలను ఎవరికీ అందించకుండా మూలన పడేశారు.

ఎంపీడీవో కార్యాలయంలో మూలన ఉన్న పరికరాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దికెర, ఏప్రిల్‌ 16: టీడీపీ హయాంలో రైతులకు ఆదరణ పథకం కింద మంజూరైన రాయితీ పరికరాలను ఎవరికీ అందించకుండా మూలన పడేశారు. మద్దికెర ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రైతులకు సంబంధించి జొన్న సొప్పను తొలగించే యంత్రాలను ఎవరికీ ఇవ్వకుండా మూలనపెట్టారు. వీటి ధర ఒక్కొక్కటి రూ.14వేలు, అయితే సదరు బీసీలు 10శాతం రాయితీ రూ.1400 చెల్లిస్తే ఈ పరికరాలను అందించాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఎవరికీ ఇవ్వకపోవడంతో రోజురోజకు తుప్పుపట్టిపోతున్నాయి. అలా మొత్తం 6 యంత్రాలు ఉన్నాయి. ఇప్పటి కైనా అధికారులు స్పందించి అర్హులకు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఎంపీ డీవో నరసింహమూర్తిని వివరణ కోరగా గత ప్రభుత్వ హయాంలో వచ్చాయని, అందుకు సంబంధించిన వివరాలను తెప్పించుకుని అందిస్తామని తెలిపారు.

Updated Date - 2021-04-17T04:44:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising