AP: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు
ABN, First Publish Date - 2021-10-13T13:29:24+05:30
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ప్లో 1,25,316 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,22,270 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటినిల్వ 214.3637 టీఎంసీలుగా ఉంది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Updated Date - 2021-10-13T13:29:24+05:30 IST