శ్రీశైలంలో వివాహిత ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2021-11-25T13:42:52+05:30
శ్రీశైలం ప్రధాన ఆలయంలో సమీపంలో వివాహిత ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది.
కర్నూలు: శ్రీశైలం ప్రధాన ఆలయంలో సమీపంలో వివాహిత ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన మౌనిక అనే మహిళ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. వెంటనే వివాహితను సున్నిపెంటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మౌనిక హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం భర్త అభిలాష్ రెడ్డిపై సరూర్నగర్ పోలీస్స్టేషన్లో మౌనిక ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నారని వివాహిత ఫిర్యాదు పేర్కొంది. ఈ రోజు సరూర్ నగర్ మహిళ పోలీస్ స్టేషన్లో ఇద్దరికి కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది. నిన్న చివరి సారి అభిలాష్తో మాట్లాడి శ్రీశైలం వెళ్లిన మౌనిక ఈ అఘాయిత్యానికి యత్నించింది. అభిలాష్ రెడ్డి కూడా సాఫ్ట్వేర్ ఉద్యిగిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-11-25T13:42:52+05:30 IST