అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ
ABN, First Publish Date - 2021-12-03T05:41:15+05:30
జిల్లాలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ సుధీర్ కుమార్రెడ్డి తెలిపారు.
శిరివెళ్ల, డిసెంబరు 2: జిల్లాలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ సుధీర్ కుమార్రెడ్డి తెలిపారు. శిరివెళ్ల పోలీస్ స్టేషన్ను ఆయన గురువారం తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించినా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శిరివెళ్లకు చెందిన ఓ వ్యక్తి తనను అకారణంగా కులం పేరుతో దూషించి తన పట్ల అమర్యాదగా వ్యవహరించాడని, అతడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని రుద్రవరం మండలం మాచినేనిపల్లె గ్రామానికి చెందిన నేగల నాగబాబు రాతపూర్వకంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారించి తగిన న్యాయం చేస్తామని ఎస్పీ అన్నారు. ఆయన వెంట సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్ఐ శరత్ కుమార్రెడ్డి ఉన్నారు.
Updated Date - 2021-12-03T05:41:15+05:30 IST