రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు
ABN, First Publish Date - 2021-04-13T05:37:46+05:30
మండలంలోని శాంతినగరం వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
- ఆరుగురికి స్వల్ప గాయాలు
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 12: మండలంలోని శాంతినగరం వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్కు చెందిన వీరు తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవరు నిద్రమత్తులో ఉండటంతో కారు రోడ్డు పక్కకు వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు తెలియవని రూరల్ ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. ఈ ప్రమాదంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, గాయపడిన వారిని హైవే సిబ్బంది నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారని, బాధితులు ప్రఽథమ చికిత్స చేయించుకోని వెళ్లిపోయారని ఎస్ఐ వివరించారు.
Updated Date - 2021-04-13T05:37:46+05:30 IST