ఆటో బోల్తా.. ఆరుగురు కూలీలకు తీవ్ర గాయాలు
ABN, First Publish Date - 2021-02-27T05:51:23+05:30
మండలంలోని జుమాలదిన్నె గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన ఆరుగురు కూలీలు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
- ఇద్దరి పరిస్థితి విషమం
కోసిగి, ఫిబ్రవరి 26: మండలంలోని జుమాలదిన్నె గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడి ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన ఆరుగురు కూలీలు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల మేరకు.. జుమాలదిన్నె పొలంలో పనిచేసి, తిరిగి పెద్దతుంబళానికి శుక్రవారం రాత్రి బయలుదేరారు. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణీస్తున్న కూలీలు రజియా, ముంతాజ్, తహేరా, మాబన్నిలు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు షేకంబీ, సోఫియా పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆదోనికి తరలించారు. పరిస్థితి విషమంగా ఇద్దరి కూలీలను కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఆదోని అవుట్పోస్టు కానిస్టేబుళ్లు తెలిపారు.
Updated Date - 2021-02-27T05:51:23+05:30 IST