బాధ్యతలు స్వీకరించిన పశుసంవర్థకశాఖ జేడీ
ABN, First Publish Date - 2021-06-18T05:05:00+05:30
పశువుల ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజూ విధులకు హాజరవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్థకశాఖ జేడీ రమేష్ హెచ్చ రించారు.
కర్నూలు(అగ్రికల్చర్), జూన్ 17: పశువుల ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ప్రతిరోజూ విధులకు హాజరవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్థకశాఖ జేడీ రమేష్ హెచ్చ రించారు. గురువారం ఆయన కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ మూగజీవాల సంరక్షణ కోసం, అలాగే పాడి పశువుల వల్ల రైతులు ప్రయోజనం పొందేలా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు చేరవేయాలని వైద్యులకు సూచించారు. డిప్యూటీ డైరెక్టర్లు రమణయ్య, దుర్గా ప్రసన్నబాబు, వైద్యులు శ్యామ్, సూపరింటెండెంట్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-18T05:05:00+05:30 IST