అభివృద్ధిపై చర్చకు సిద్ధమే
ABN, First Publish Date - 2021-10-21T05:30:00+05:30
సీపీ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమేనని టీడీపీ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్రెడ్డి ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డికి సవాల్ విసిరారు.
- టీడీపీ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్రెడ్డి
ఆళ్లగడ్డ్డ, అక్టోబరు 21: వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమేనని టీడీపీ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్రెడ్డి ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డికి సవాల్ విసిరారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి వ్యక్తిగత విమర్శలు మాని జరిగిన అభివృద్ధికి చర్చకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకుడు పట్టాభి సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అయితే మంత్రి కోడాలి నాని ప్రతి నిత్యం బూతు పురాణం చేస్తున్నారని, దీనికి ఎవరు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈసమావేశంలో టీడీపీ నాయకులు బాచ్చాపురం శేఖర్రెడ్డి, కౌన్సిలర్ హుసేన్బాషా, నాగిరెడ్డిపల్లె శేఖర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ చాంద్బాషా పాల్గొన్నారు.
Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST