పెద్దాసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
ABN, First Publish Date - 2021-10-17T06:14:27+05:30
డోన్కు చెందిన 35 ఏళ్ల బాలమ్మకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ విభాగంలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడారు.
కర్నూలు(హాస్పిటల్), అక్టోబరు 16: డోన్కు చెందిన 35 ఏళ్ల బాలమ్మకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ విభాగంలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి ప్రాణాన్ని కాపాడారు. గత రెండేళ్ల నుంచి యోని ద్వారా పేగులు, కొవ్వు బయటకు రావడంతో నరకయాతన అనుభవిస్తోంది. గైనిక్ సీనియర్ ప్రొఫెసర్ డా.మాణిక్యరావు తన సిబ్బందితో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. బయట కువచ్చిన పేగులు, కొవ్వును తిరిగి కడపులో యథాస్థానంలో ఉంచి కొవ్వును, వెన్నెముక, కడుపు చుట్టూ, పక్కన ఎముకలకు అమర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 3 గంటలు శ్రమించి శుక్రవారం శస్త్ర చికిత్స నిర్వహించా మన్నారు. గత 35 ఏళ్లలో ఇలాంటి శస్త్ర చికిత్స ఎప్పుడూ నిర్వహించలేదన్నారు. రోగి ఆరోగ్యంగా ఉందన్నారు. శస్త్ర చికిత్సలో గైనిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రత్న, జనరల్ సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.మల్లికార్జున, అనస్థీషియా వైద్యులు డా.శంకర్ పాల్గొన్నారు.
Updated Date - 2021-10-17T06:14:27+05:30 IST