ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంప్‌హౌస్‌ మూత

ABN, First Publish Date - 2021-12-06T06:17:51+05:30

మంత్రాలయం మండలంలోని మాధవరం-రాంపురం గ్రామాల మధ్య నిర్మించిన గురురాఘవేంద్ర మాధవరం పంప్‌హౌస్‌ మూతపడింది.

మూతపడిన జీఆర్పీ పంప్‌హౌస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నదిలో నీరున్నా నిర్లక్ష్యం


మంత్రాలయం మండలంలోని మాధవరం-రాంపురం గ్రామాల మధ్య నిర్మించిన గురురాఘవేంద్ర మాధవరం పంప్‌హౌస్‌ మూతపడింది. పైప్‌లైన్‌ లీకేజీ పనులు చేపట్టకపోవడంతో ఎత్తిపోతల పథకం నుంచి నీటి సరఫరాను నిలిపేశారు. నదిలో నీరున్నా బెళగల్‌ రిజర్వాయర్‌కు అందడం లేదు. 4,210 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. మాధవరం-రచ్చుమర్రి గ్రామల సరిహద్దుల్లో పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి. మరమ్మతు పనులు తూతూమంత్రంగా చేపట్టారు. వారంలోపు పూర్తిచేయాల్సి ఉండగా, రెండు నెలలు గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రబీ పంటల సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతు చేసి, తుంగభద్ర నీటిని పంపింగ్‌ చేసి రిజర్వాయర్‌ను నింపాలని కోరుతున్నారు.


- మంత్రాలయం

Updated Date - 2021-12-06T06:17:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising