వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-04-17T04:47:39+05:30
బాపనంతాపురం గ్రామానికి చెందిన బెల్లి శ్రీనివాసులు (29) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడని హెడ్కానిస్టేబుల్ చిట్టి బాబు తెలిపారు.
పాములపాడు,
ఏప్రిల్ 16: బాపనంతాపురం గ్రామానికి చెందిన బెల్లి శ్రీనివాసులు (29)
అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడని హెడ్కానిస్టేబుల్ చిట్టి బాబు
తెలిపారు. శ్రీనివాసులు ఉగాది పండుగ రోజున మామిడి ఆకులు తీసుకు వస్తానని
ఇంట్లో నుంచి బయటికి వెళి తిరిగి ఇంటికి రాలేదు. ఆ రోజే బావిలో పడి ఆత్మ
హత్యకు పాల్పడినట్లు చెప్పారు. దాదాపు 5 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయని
అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు
మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు హెడ్కానిస్టేబుల్ చిట్టిబాబు తెలిపారు.
ఉపాధ్యాయుడి ఆత్మహత్య
అవుకు,
ఏప్రిల్ 16: ప్రభుత్వ ఉపాధ్యాయుడు మిట్ట మీది మురళీకృష్ణ (43) అవుకు
రిజర్వాయర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ మహేష్ కుమార్ తెలి
పిన వివరాల మేరకు మృతుడు మురళీకృష్ణ స్వగ్రామం అనంతపురం జిల్లా,
గార్లదిన్నె మండలం, కోటంక గ్రామం. తాడిపత్రిలో కుటుంబ సభ్యులతో
నివాసముంటున్నాడు. తాడిపత్రి సమీపంలోని ఎస్ కొట్టాల గ్రామంలో ప్రాఽథమిక
పాఠశాలలో ఉపాధ్యా యుడుగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా అనారోగ్యంతో
బాధపడుతుండేవాడు. జీవితంపై విరక్తి చెంది ఈ నెల 14వతేదీన రాత్రికి అవుకు
రిజర్వాయర్ వద్దకు చేరుకొని రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉదయం మృతదేహం రిజర్వా యర్లో తేలడంతో పోలీసులు జాలర్ల సహాయంతో బయ టకు
తీశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య శ్వేత,
కూతురు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని
దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2021-04-17T04:47:39+05:30 IST