ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల కష్టాలు తీరాలి: తిక్కారెడ్డి

ABN, First Publish Date - 2021-10-17T06:12:04+05:30

మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజల కష్టాలుతీరి రైతులు పాడిపంటలతో సుఖంగా జీవించాలని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రాలయం,అక్టోబరు 16. మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజల కష్టాలుతీరి రైతులు పాడిపంటలతో సుఖంగా జీవించాలని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. విజయదశమి వేడుకలను పురస్కరించుకొని రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయదశమి నుంచి రైతుల కష్టాలు తీరాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని రైతన్నల శ్రమకు తగినఫలితం లభించాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. అంతకు ముందు గ్రామదేవతను దర్శించుకున్నారు. మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పన్నాగవెంకటేశ్‌, నాగిరెడ్డి, యోబు, నరసింహులు, సూగూరు భాస్కర్‌రెడ్డి, మేకల నరసింహులు పాల్గ్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising