3,26,934 నోటు పుస్తకాలు సరఫరా
ABN, First Publish Date - 2021-05-18T05:47:24+05:30
ప్రభుత్వం జగనన్న విద్యాకానుక కిట్లల్లో భాగంగా 3,26,934 నోటు పుస్తకాలు జిల్లాకు సరఫరా చేసినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), మే 17: ప్రభుత్వం జగనన్న విద్యాకానుక కిట్లల్లో భాగంగా 3,26,934 నోటు పుస్తకాలు జిల్లాకు సరఫరా చేసినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లూరుకు 81,498, ఓర్వకల్లుకు 45,432, నందికొట్కూరుకు 40,344, జూపాడుబంగ్లాకు 23,338, క్రిష్ణగిరికి 37,476, వెల్దుర్తికి 50,754, పగిడ్యాలకు 23,000 నోటుబుక్స్ వచ్చాయన్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి 4,61,885 కిట్లు అవసరం ఉందన్నారు. ఇందులో 1 నుంచి 10వ తరగతి చదివే బాలికలు 2,27,629 మంది, బాలురు 2,34,256 మందిని గుర్తించామన్నారు. కిట్లలోని వస్తువులు నాణ్యత పరిశీలించి డ్యామేజీ అయితే.. ప్రధానోపాధ్యాయులు వెనక్కి ఇవ్వాలన్నారు.
Updated Date - 2021-05-18T05:47:24+05:30 IST