మరకత లింగేశ్వరుడికి ఎంపీ పూజలు
ABN, First Publish Date - 2021-04-14T06:25:34+05:30
మహానంది మండలం గాజులపల్లి ఆర్ ఎస్ సమీపంలోని మరకతలింగేశ్వర ఆలయంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహానంది, ఏప్రిల్ 13: మహానంది మండలం గాజులపల్లి ఆర్ ఎస్ సమీపంలోని మరకతలింగేశ్వర ఆలయంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఎంపీ మరకత లింగేశ్వరుని దర్శనం కోసం రాగా ఆలయం వద్ద నిర్మాణదాత కనుమర్లపూడి మస్తాన్రావు ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ గాజులపల్లి ఆర్ ఎస్ సర్పంచ్ అస్లాంబాషా కలిసి గ్రామంలో నీటి సమస్యను వివరించారు. దీనిపై వెంటనే ఆయన బోరు వెయ్యిస్తానని హామీ ఇచ్చారు.
Updated Date - 2021-04-14T06:25:34+05:30 IST