మంత్రాలయంలో కరోనా కల్లోలం
ABN, First Publish Date - 2021-04-19T05:29:38+05:30
మంత్రాలయంలో కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల్లో 55 కేసులు నమోదవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంత్రాలయం పట్టణంలోనే 39 పాజిటివ్లు నమోదు అయ్యాయి.
- మండలంలో 55 కరోనా కేసులు
మంత్రాలయం, ఏప్రిల్ 18: మంత్రాలయంలో కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. రెండు రోజుల్లో 55 కేసులు నమోదవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంత్రాలయం పట్టణంలోనే 39 పాజిటివ్లు నమోదు అయ్యాయి. రామచంద్రనగర్, రాఘవేంద్ర నగర్, సుజాయీంద్రనగర్, పాతూరు కాలనీల్లో కేసులు నమోదైయ్యాయి. మాధవరం తండాలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. చిలకలడోణ, బూదూరు, కలుదేవకుంటలో 2 కేసుల చొప్పన, సూగూరు, మాధవరంలో ఒకటి చొప్పన కేసులు నమోదయ్యాయి. శనివారం కరోనా కూడా పరిక్షలను నిర్వహించడంతో మరినిన నమోదయ్యే అవకాశం ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం తప్పని సరిగ్గా పాటించాలని, శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.
Updated Date - 2021-04-19T05:29:38+05:30 IST