ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటర్‌ ట్యాంకు ఎక్కి హల్‌చల్‌ చేసిన వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-04-14T06:22:59+05:30

ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈ నెల 10వ తేదీన వాటర్‌ ట్యాంకు ఎక్కి హల్‌చల్‌ చేసిన వ్యక్తి మంగళవారం మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, ఏప్రిల్‌ 13: ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈ నెల 10వ తేదీన వాటర్‌ ట్యాంకు ఎక్కి హల్‌చల్‌ చేసిన వ్యక్తి మంగళవారం మృతిచెందారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మకూరుతో పాటు పరిసర గ్రామాల్లో గత కొన్ని రోజులుగా సంచరించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీన వెంకటాపురం గ్రామంలోని ఎస్సీకాలనీలో ఉన్న ఓ వాటర్‌ ట్యాంకును ఎక్కి దుస్తులు లేకుండా నగ్నంగా కేకలు వేస్తూ.. హల్‌చల్‌ సృష్టించాడు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతన్ని బంధించి కిందికి దించి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే ఆ మరుసటి రోజు నుంచి మతిస్థిమితం లేని వ్యక్తి పట్టణంలో సంచరిస్తూ.. ఎవరన్నా ఆహారం ఇచ్చినా తినేవాడు కాదు. ఈ క్రమంలో డీహైడ్రేషన్‌కు గురై పట్టణ శివార్లలోని శ్రీశైలం రస్తాలో ఉన్న మురుగు గుంతలో పడి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతికి గల కారణాలను ఆరా తీశారు. మున్సిపల్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2021-04-14T06:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising