ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మమ్మల్ని రెగ్యులర్‌ చేయండి

ABN, First Publish Date - 2021-06-25T06:25:16+05:30

ప్రాణాలకు తెగించి కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులు గురువారం కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

సీఎంను కొంగుపట్టి అర్థిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగుల వినూత్న నిరసన


కర్నూలు(హాస్పిటల్‌), జూన్‌ 24: ప్రాణాలకు తెగించి కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులు గురువారం కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కాంట్రాక్టు మహిళా పారామెడికల్‌ ఉద్యోగులు కొంగుపట్టి అడిగారు. ఈ నిరసనకు కర్నూలు జిల్లాలోని వివిధ వైద్య ఉద్యోగుల సంఘాలు సంఘీభావం తెలిపాయి. కర్నూలు జిల్లా కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా కన్వీనర్‌ పి.ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా కాంట్రాక్టు వ్యవస్థలోనే మగ్గిపోతున్నా పాలకులు రెగ్యులర్‌ చేయకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. ఎన్నికల సమయంలో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టారని, ఇంతవరకు తమను పట్టించుకోవడం లేదని అన్నారు. అనంతరం కర్నూలు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్యకు జేఏసీ నేతలు వినతి పత్రం సమర్పించారు.

Updated Date - 2021-06-25T06:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising