‘గ్రంథాలయానికి పింగళి సూరన పేరు పెట్టాలి’
ABN, First Publish Date - 2021-12-02T05:13:38+05:30
నంద్యాల శాఖ గ్రంథాలయానికి శ్రీకృష్ణ దేవరాయుల అస్థాన పండితుల్లో ఒకరైన పింగళి సూరనామాత్యులు పేరు పెట్టాలని సూరన సారస్వత సంఘం అధ్యక్షుడు డాక్టర్ గెలివి సహాదేవుడు, సభ్యులు, రాష్ట్ర పబ్లిక్ గ్రంథాలయ డైరెక్టర్ ఎంఆర్ ప్రసన్న కుమార్ను కోరారు.
నంద్యాల, డిసెంబరు 1: నంద్యాల శాఖ గ్రంథాలయానికి శ్రీకృష్ణ దేవరాయుల అస్థాన పండితుల్లో ఒకరైన పింగళి సూరనామాత్యులు పేరు పెట్టాలని సూరన సారస్వత సంఘం అధ్యక్షుడు డాక్టర్ గెలివి సహాదేవుడు, సభ్యులు, రాష్ట్ర పబ్లిక్ గ్రంథాలయ డైరెక్టర్ ఎంఆర్ ప్రసన్న కుమార్ను కోరారు. బుధవారం స్థానిక గ్రంథాలయాన్ని రాష్ట్ర డైరెక్టర్ ప్రసన్నకుమార్ తనిఖీ చేశారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో పఠన ఆసక్తి పెంచడానికి గ్రంథాలయాలు తోడ్పడతాయన్నారు. స్థానిక గ్రంథాలయాన్ని డీజీటల్ రూపంలో మార్చడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సూరన సారస్వత సంఘం ప్రతినిధులు రాష్ట్ర డైరెక్టర్ను కలిసి నంద్యాల శాఖ గ్రంథాలయానికి పింగళి సూరన పేరు పెట్టాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి బషీర్ అహమ్మద్, జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీరాఘవరెడ్డి, కవి నీలకంఠమాచారి, లాలు, రాజేష్, వెంకటేశ్వర్లు, నరసింహులు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-02T05:13:38+05:30 IST