AP: తుంగభద్ర జలాశయం 10 గేట్లు 1.5 అడుగు వరకు ఎత్తివేత
ABN, First Publish Date - 2021-07-31T15:35:39+05:30
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు డ్యామ్ 10 గేట్లు 1.5 అడుగు
కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు డ్యామ్ 10 గేట్లు 1.5 అడుగు వరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా... ప్రస్తుతం నీటి మట్టం 1632.44 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 100 టీఏంసీలకు గాను...ప్రస్తుతం నీటి నిల్వ 98.701 టీఎంసీలకు చేరింది. ఇన్ ఫ్లో 39975 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 48685 క్యూసెక్కులుగా ఉంది.
Updated Date - 2021-07-31T15:35:39+05:30 IST