AP: శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఉధృతి
ABN, First Publish Date - 2021-10-11T14:22:22+05:30
జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది.
కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ప్లో 1,71,377 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,76,034 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటినిల్వ 214.8450 టీఎంసీలకు చేరింది. మరోవైపు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Updated Date - 2021-10-11T14:22:22+05:30 IST