‘పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయండి’
ABN, First Publish Date - 2021-09-05T05:14:30+05:30
విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు బీసీ స్టడీ సర్కిల్ అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ (ఆసరా, సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు ఆదేశించారు.
కల్లూరు, సెప్టెంబరు 4: విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు బీసీ స్టడీ సర్కిల్ అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ (ఆసరా, సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం కల్లూరు ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోని బీసీ స్టడీ సర్కిల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో జేసీ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్ను యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. స్టడీ సర్కిల్లోని లైబ్రరీని, శిక్షణా తరగతి గదులను పరిశీలించిన అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన లేటెస్టు పుస్తకాలు, న్యూస్ పేపర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్ బాషా, బీసీ కార్పొరేషన్ ఈడీ శివలీల, బీసీ స్టడీ సర్కిల్ జిల్లా కోఆర్డినేటర్ అనూరాధ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-05T05:14:30+05:30 IST