వసతి భవనాల పరిశీలన
ABN, First Publish Date - 2021-10-22T04:27:32+05:30
శ్రీశైల దేవస్థానం వసతి భవనాలను పరిపాలానాశాల సమీక్షలో భాగంగా గురువారం కార్యనిర్వాహణాధికారి ఎస్.లవన్న పరిశీలించారు.
శ్రీశైలం, అక్టోబరు 21: శ్రీశైల దేవస్థానం వసతి భవనాలను పరిపాలానాశాల సమీక్షలో భాగంగా గురువారం కార్యనిర్వాహణాధికారి ఎస్.లవన్న పరిశీలించారు. దేవస్థానం పరిధిలోని మల్లికార్జున సదనం, గంగా గౌరీ సదనం, పాతాళేశ్వరసదనం, చండీశ్వరసదనం, అంబాసదనాన్ని పరిశీలించారు. ఈవో లవన్న మాట్లాడుతూ భవనాలకు అవసరమైన చోట మరమ్మతులు, పెయింటింగ్ పనులను వెంటనే చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాధితులను ఆదేశించారు. భక్తుల నుంచి వసతి సదుపాయాలకు సంబంధించి ఎలాంటి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం దేవస్థాన వసతి భవనాల వద్ద పూజా వివరాలు, సేవలు, గదులకు సంబంధించి అద్దె వివరాలు తెలిసే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. వసతి భవనాల వద్ద పారిశుధ్య పనులను ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పారిశుధ్య విభాగాన్ని ఆదేశించారు.
Updated Date - 2021-10-22T04:27:32+05:30 IST