ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్లు, కార్డులు తొలగిస్తే ఉద్యమిస్తాం

ABN, First Publish Date - 2021-10-26T05:37:04+05:30

రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని తెలుగుదేశం పార్టీ కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి హెచ్చరించారు.

రాస్తారోకో నిర్వహిస్తున్న దివ్యాంగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  సోమిశెట్టి, గౌరు హెచ్చరిక 


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 25: రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని తెలుగుదేశం పార్టీ కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి హెచ్చరించారు. సోమవారం టీడీపీ నాయకులు, విభిన్న ప్రతిభావంతులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. సోమిశెట్టి, గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్లు, రేషన్‌ కార్డులను తొలగించి వారి నోటికాడి కూడును లాగేసుకోవడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు వారికి అన్ని వసతులు కల్పించామన్నారు. టీడీపీ కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, వికలాంగుల సంఘం అధ్యక్షుడు పర్ల ఎల్లప్ప, కార్యదర్శులు సురేష్‌, రమణారెడ్డి, శ్రీను, మక్బూల్‌, మద్దిలేటి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising