హుండీ లెక్కింపు
ABN, First Publish Date - 2021-10-30T04:05:35+05:30
నందవరం చౌడేశ్వరీమాత ఆలయం హుండీని ఆలయ ఈవో రామానుజన, ఆలయ చైర్మన పీఆర్.వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ లెక్కించారు.
బనగానపల్ల్లె, అక్టోబరు 29: నందవరం చౌడేశ్వరీమాత ఆలయం హుండీని ఆలయ ఈవో రామానుజన, ఆలయ చైర్మన పీఆర్.వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ లెక్కించారు. కల్లూరు చౌడేశ్వరీమాత ఆలయం ఈవో వి. సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు ఈవో రామానుజన తెలిపారు. కోవెలకుంట్ల సత్యనారాయణ సేవా సమితి సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొన్నట్లు తెలిపారు. గడచిన 6 నెలలకు గాను రూ. 45,874 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో తెలిపారు. అలాగే 143 అమెరికన డాలర్లు కూడా ప్రవాస భారతీయ భక్తులు హుండీలో వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వేదపండితులు, ఏపీజీఈ క్యాషియర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:05:35+05:30 IST