గుడ్డు కోసం గుంపులు గుంపులుగా..
ABN, First Publish Date - 2021-06-24T04:58:58+05:30
గుడ్డు కోసం విద్యార్థులు గుంపులు గుంపులుగా నిలిచారు.
హొళగుంద, జూన్ 23: గుడ్డు కోసం విద్యార్థులు గుంపులు గుంపులుగా నిలిచారు. అప్రమత్తం చేయాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం గుడ్లు పంపిణీ చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠశాల వద్దే గుడ్లు పంపిణీ చేయడంతో ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. అయితే భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన ఉపాధ్యాయులు అవేం పట్టించుకోలేదు. ఓ వైపు థర్డ్వేవ్ ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెబుతున్నా ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడం సరికాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున అన్నారు.
Updated Date - 2021-06-24T04:58:58+05:30 IST