ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టీడీపీ అధికారంలోకి రాగానే ఉచిత రిజిస్ట్రేషన్లు’

ABN, First Publish Date - 2021-12-05T04:55:28+05:30

రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే ఇళ్లకు ఉచితంగా రిజిస్ర్టేషన్లు చేస్తామని టీడీపీ నాయకులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మిగనూరు, డిసెంబరు 4: రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే ఇళ్లకు ఉచితంగా రిజిస్ర్టేషన్లు చేస్తామని టీడీపీ నాయకులు అన్నారు. శనివారం టీడీపీ కార్యలయంలో పట్టణ అధ్యక్షుడు సుందరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని మరచి అరాచకపాలన సాగిస్తోందన్నారు. రాష్ర్టాభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. పేదప్రజలను దోచుకునేందుకే ఓటీఎస్‌ పథకాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో మైనార్టీ పట్టణ అధ్యక్షులు కేఎండీ ఫారుక్‌, పట్టణ కార్యధర్శి చేనేతమల్లి, కౌన్సిలర్లు రామదాసుగౌడ్‌, దయాసాగర్‌, మాజీ కౌన్సిలర్లు ముల్లాకలీముల్లా, శాబీర్‌, రంగస్వామి గౌడ్‌, రామకృష్ణ, జయన్న, రంగన్న, నాగేష్‌ఆచారి, కటారి రాజేంద్ర, బచ్చాల రంగన్న, పరమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-05T04:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising