ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-03-02T06:50:51+05:30

అప్పుల బాధ తాళలేక మండలంలోని లచ్చుంపల్లె గ్రామానికి చెందిన రైతు దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.

మృతురాలు మాదేవి (ఫైల్‌), రామక్రిష్ణ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం 

డోన్‌(రూరల్‌), మార్చి 1: అప్పుల బాధ తాళలేక మండలంలోని లచ్చుంపల్లె గ్రామానికి చెందిన రైతు దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. రామక్రిష్ణ అనే రైతుకు గ్రామంలో మూడెకరాల పొలం ఉంది. దీనికితోడు మల్లెంపల్లెలో నాలుగెకరాలు, ఎర్రగుంట్లలో మరో పదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కౌలుకు తీసుకున్న పొలాల్లో బోర్లు వేయించడానికి అప్పులు చేశాడు. బోర్లలో సరైన నీరు పడకపోవడంతో మూడేళ్లుగా వర్షాధారంగా కౌలు భూములలో ఉల్లి, మిర్చి టమోట, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నాడు. ఏటా పంటలు చేతికి రాకపోవడంతో అప్పులు రూ.15 లక్షలకు పైగా పెరిగాయి. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో భార్యాభర్తలకు మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి పంటల కోసం తెచ్చుకున్న పురుగు మందును భార్యాభర్తలు ఇంట్లోనే తాగారు. చుట్టుపక్కల వారు వారిని డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య మాదేవి (36) కోలుకోలేక మృతి చెందింది. రామక్రిష్ణ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయన్ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామక్రిష్ణకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జగన్మోహన్‌ పదో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడు రామలింగం 8వ తరగతి చదువుతున్నాడు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-03-02T06:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising