రైతు ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-27T05:29:05+05:30
మండల పరిధిలోని లద్దగిరిలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడాడు.
కోడుమూరు(రూరల్), అక్టోబరు 26: మండల పరిధిలోని లద్దగిరిలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడాడు. ఎస్ఐ వేణుగోపాల్ వివరాల మేరకు, గ్రామానికి చెందిన గూడూరు శివరాముడు(41) తనకున్న మూడు ఎకరాలకు తోడు మరి కొంత పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. ఉల్లి, పత్తి పంటలు సాగు చేసేవాడు. గత ఏడాది అధిక వర్షాలతో, ఈ ఏడాది వాతావరణం అనుకూలించక తీవ్రంగా నష్టపోయాడు. పంటల సాగు కోసం చేసిన రూ.5 లక్షలకు పైగా అప్పు చేశాడు. అప్పులు తీర్చే మార్గం తెలియక జీవితంపై విరక్తి చెంది సోమవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక రైతు మృతి చెందాడు. మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైతు శివరాముడికి భార్య అనంతమ్మ, కొడుకు, కూతురు ఉన్నారు. రైతు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Updated Date - 2021-10-27T05:29:05+05:30 IST