‘టీడీపీ హయాంలోనే అభివృద్ధి’
ABN, First Publish Date - 2021-11-29T05:23:12+05:30
టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని టీడీపీ నాయకులు జగ్గాపురం గడంగం నరసింహ, బాపురం రాఘవరెడ్డి అన్నారు.
నందవరం, నవంబరు 28: టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని టీడీపీ నాయకులు జగ్గాపురం గడంగం నరసింహ, బాపురం రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం వారు మాట్లాడుతూ గురురాఘవేంద్ర ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీవీ కుటుంబానిదే అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలో పిడికెడు మట్టి వేసిన పాపాన పోలేదన్నారు. వచ్చేది టీడీపీయే అని మళ్లీ చంద్రబాబు సీఎం, ఎమ్మిగనూరులో బీవీ జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యే అన్నారు.
Updated Date - 2021-11-29T05:23:12+05:30 IST