పత్తి క్వింటం రూ.8,290
ABN, First Publish Date - 2021-10-22T05:15:06+05:30
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు తగ్గాయి. గత 10 రోజుల కిందటితో పోల్చితే క్వింటానికి రూ.450 పైగా తగ్గింది. రికార్డు స్థాయిలో పలికిన ధర అమాంతంగా పతనమైంది.
ఆదోని(అగ్రికల్చర్), అక్టోబరు 21: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు తగ్గాయి. గత 10 రోజుల కిందటితో పోల్చితే క్వింటానికి రూ.450 పైగా తగ్గింది. రికార్డు స్థాయిలో పలికిన ధర అమాంతంగా పతనమైంది. గురువారం పత్తి క్వింటం గరిష్టంగా రూ.8290 పలికింది. ప్రధానంగా పత్తి గింజల ధరలు అమాంతంగా పడిపోవడమే పత్తి ధర పతనం కావడానికి కారణమని వ్యాపారులు పేర్కొన్నారు. పత్తి సీజన్ ఆరంభంలో రికార్డు స్థాయిలో ధర పెరిగి అంతలోనే తగ్గిపోవడంతో రైతులు నిరాశకు లోనయ్యారు. మార్కెట్ యార్డుకు 10,777 క్వింటాళ్లు పత్తి విక్రయానికి రాగా కనిష్టంగా రూ.5059, గరిష్టంగా రూ.8290 పలికింది.
Updated Date - 2021-10-22T05:15:06+05:30 IST