ప్రజల మద్దతు కాంగ్రెస్కు ఖచ్చితంగా ఉంటుంది: శైలజానాథ్
ABN, First Publish Date - 2021-07-17T18:12:57+05:30
ఏపీలో చేతగాని, అసమర్థ, దోపిడీ ప్రభుత్వం పాలిస్తుందని పీసీసీ చీఫ్ శైలజానాథ్ విమర్శించారు.
కర్నూలు: ఏపీలో చేతగాని, అసమర్థ, దోపిడీ ప్రభుత్వం పాలిస్తుందని పీసీసీ చీఫ్ శైలజానాథ్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజల మద్దతు కాంగ్రెస్కు ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెంచారని మండిపడ్డారు. కృష్ణా, గోదావరి బోర్డులను కేంద్రం పరిధిలోకి తీసుకోవడం మంచిదే.... విభజన చట్టంలో పొందుపరిచినదే అమలు చేశారని శైలజానాథ్ పేర్కొన్నరు.
Updated Date - 2021-07-17T18:12:57+05:30 IST