కర్నూలుకు చేరుకున్న కలెక్టర్
ABN, First Publish Date - 2021-07-30T05:57:34+05:30
జిల్లా నూతన కలెక్టర్ పి.కోటేశ్వర్రావు గురువారం రాత్రి కర్నూలు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు.
- నేడు బాధ్యతల స్వీకరణ
కర్నూలు కలెక్టరేట్, జూలై 29: జిల్లా నూతన కలెక్టర్ పి.కోటేశ్వర్రావు గురువారం రాత్రి కర్నూలు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. ఆయనకు జాయిట్ కలెక్టర్లు రాంసుందర్రెడ్డి, మనజీర్ జిలానీసాము, శ్రీనివాసులు, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్అన్సారీయ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. కోటేశ్వరావు శుక్రవారం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. స్వాగతం పలికిన వారిలో పీఆర్వో పులయ్య, కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్, కర్నూలు తహసీల్దార్ రమేష్ ఉన్నారు.
Updated Date - 2021-07-30T05:57:34+05:30 IST