కూలిన మట్టిమిద్దె
ABN, First Publish Date - 2021-12-04T05:33:21+05:30
మండలంలోని చిన్నవంగలి గ్రామంలో పుల్లయ్యకు చెందిన మట్టిమిద్దె శుక్రవారం సాయంత్రం కూలింది.
- ప్రాణాలతో బయటపడ్డ విద్యార్థి
చాగలమర్రి, డిసెంబరు 3: మండలంలోని చిన్నవంగలి గ్రామంలో పుల్లయ్యకు చెందిన మట్టిమిద్దె శుక్రవారం సాయంత్రం కూలింది. పుల్లయ్య కుమారుడు చరణ్ పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి తలుపు తీసి లోపలికి వెళ్లాడు. ఉన్నఫలంగా మట్టిమిద్దె కూలింది. బయట ఉన్న తండ్రి కేకలు వేయడంతో గ్రామస్థులు స్పందించి మట్టిలో కూరుకపోయిన చరణ్ను బయటకు తీశారు. దీంతో చరణ్ ప్రాణాలతో బయటపడ్డాడు. గృహంలో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులు దెబ్బతిని రూ.లక్ష నష్టం వాటిల్లింది. కూలిన మట్టిమిద్దెను టీడీపీ నాయకులు సంజీవరెడ్డి, నర్సిరెడ్డి పరిశీలించారు.
Updated Date - 2021-12-04T05:33:21+05:30 IST