ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర్మ రక్షణకు క ట్టుబడి ఉండాలి

ABN, First Publish Date - 2021-01-20T05:46:06+05:30

ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని త్రిదండి చిన జీయర్‌ స్వామి ఉద్బోధించారు.

మాట్లాడుతున్న చిన జీయర్‌స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిదండి చిన జీయర్‌ స్వామి


కర్నూలు(కల్చరల్‌), జనవరి 19: ధర్మ రక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని త్రిదండి చిన జీయర్‌ స్వామి ఉద్బోధించారు. మంగళవారం స్థానిక దేవీ ఫంక్షన్‌ హాలులో సమరసత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వధర్మ ఆచరణ మహాయజ్ఞం, బంధు సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఏళ్ల క్రితం భారతదేశంలో ఏ మతాలు లేవని, కాలగమనంలో అనేక మతాలు వచ్చినా ఎవరి మత విశ్వాసాలు వారివేనని అన్నారు. మతం మనిషికి క్రమశిక్షణ నేర్పేలా ఉండాలని, ఇతర మతాలను గౌరవించేలా మనిషి ఎదగాలని అన్నారు. మన దేవుళ్లను పూజించుకుందామని, అలాగే మనది కానిదాన్ని గౌరవిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు మంచిది కాదని, దీని ప్రభావం సమాజంపై చూపిస్తుందని అన్నారు. హిందూ ఆలయాలపై ఓ పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలకు ఎవరైనా రావచ్చని, ఇందుకు నిబంధనలేవీ లేవని వెయ్యేళ్ల క్రితం రామానుజార్యులు తెలియజేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో త్రిదండి అహోబల స్వామి పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-20T05:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising